Skip to playerSkip to main contentSkip to footer
  • 9/12/2018
కొండగట్టు బస్సు ప్రమాద ఘటనపై బుధవారం హెచ్ఆర్సీలో పిటిషన్ దాఖలైంది. బస్సు ప్రమాదానికి బాధ్యులైన వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేయాలని పిటిషనర్ కోరారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున సాయం అందేలా చూడాలని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. మరోవైపు, కొండగట్టు బస్సు ప్రమాద కుటుంబాలకు రూ.50 లక్షలు ఇవ్వాలని అఖిలపక్షం నేతలు డిమాండ్ చేశారు. వారు బుధవారం బాధితులను పరామర్శించారు. ఈ ప్రమాదం ఏకంగా 12 గ్రామాల్లో విషాదం నింపింది. మృతుల సంఖ్య 60కి చేరుకుంది. కొండగట్టు వద్ద బస్సు 30 అడుగుల లోతున పడిపోయిన విషాద సంఘటన మంగళవారం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

Category

🗞
News

Recommended