SIT OFFICIALS QUESTIONED MP MITHUN REDDY: మద్యం కుంభకోణం కేసులో సిట్ విచారణకు వైసీపీ నేతలు వరుస కడుతున్నారు. తొలిరోజు విజయసాయిరెడ్డిని విచారించిన అధికారులు ఎంపీ మిథున్రెడ్డిపై శనివారం ప్రశ్నల వర్షం కురిపించారు. సుమారు 7 గంటల పాటు 100కు పైగా ప్రశ్నలను సంధించారు. విచారణకు సహకరించకుండా ఎదురు ప్రశ్నలు వేస్తూ మద్యంతో తనకేంటి సంబంధమని ఎంపీ బుకాయించారు. ముడుపుల వసూళ్ల నెట్వర్క్పై సమాధానాలివ్వకుండా దాటవేశారు. ఆధారాలు చూపించి దర్యాప్తు అధికారులు ప్రశ్నించగా మిథున్రెడ్డి నీళ్లు నమిలారు.
Be the first to comment