Vidadala Rajini Extortion Case : వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ మద్దతుదారులపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీలక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్పై మాజీమంత్రి విడదల రజిని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ద్వారా దాడులు చేయించినట్లు వెల్లడైంది. క్రషర్పై లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వడమే కాకుండా భారీగా జరిమానా విధించేందుకు వీలుగా తప్పుడు నివేదిక సమర్పించేలా క్షేత్రస్థాయి విచారణకు వెళ్లిన అధికారులు, సిబ్బంది, సర్వే జరిపిన థర్డ్ పార్టీ ఏజెన్సీపై రాజకీయంగా ఒత్తిడి తెచ్చారు. ఈ మేరకు నాటి గుంటూరు ఆర్వీఈవో పల్లె జాషువా విజిలెన్స్కు ఇచ్చిన వాంగ్మూలంలో స్పష్టం చేశారు.