Tuni YSRCP Councillors Join TDP : కాకినాడ జిల్లా తుని మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇవాళ పలువురు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సమక్షంలో వారు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి యనమల తెలుగుదేశం కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీలో చేరిన వారిలో రూపాదేవి, శ్రీను, ప్రభావతి, వెంకటరమణ, నాగలక్ష్మి, సుభద్రాదేవి ఉన్నారు.
Be the first to comment