Nara Bhuvaneshwari Visit to Kuppam : అన్ని రంగాల్లోనూ మహిళలు ముందు వరుసలో ఉంటేనే ఉన్నతికి చేరుకోగలరని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి సతీమణి, ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా గురువారం శాంతిపురం, గుడుపల్లె మండలాలతోపాటు కుప్పం మున్సిపాలిటీలో ఆమె పర్యటించారు. కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు, నలగాంపల్లెలో మహిళలతో ముఖాముఖి మాట్లాడారు. విద్యార్థులు సరదాగా అడిగిన పలు ప్రశ్నలకు ఆమె అంతే హృద్యంగా సమాధానాలిచ్చారు.
Be the first to comment