Celebrities To Tirumala Tirupati Temple : తిరుమల శ్రీవారిని సినీ, రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో నటి రాధిక, ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్, నటుడు, నిర్మాత అశోక్, అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి సహా పలువురు స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకున్న వారికి రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
Be the first to comment