Victims of Lagacharla met KTR : లగచర్ల భూసేకరణ బాధితుల డిమాండ్లను అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తుతామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ను కలిసిన లగచర్ల బాధితులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా ఆయనకు వివరించారు. కేటీఆర్ వారిని పరామర్శించి, ధైర్యం చెప్పారు. ప్రజల అభ్యర్థన మేరకు ప్రభుత్వం వెంటనే భూసేకరణ నోటిఫికేషన్ పూర్తిగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. బాధితుల యోగక్షేమాలు తెలుసుకున్న ఆయన ఈ పోరాటంలో అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
Be the first to comment