Vishakha Weather Station and IMD Warning Rain Alerts in AP : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరో 6 గంటల్లో తుపాన్గా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ వెల్లడించారు. గంటకు 8 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న తీవ్ర వాయుగుండం ఉత్తర వాయవ్య దిశగా పయనించి మరింత బలపడి తుపాను మారనుందని పేర్కొన్నారు. రెండు రోజుల్లో శ్రీలంకను తాకుతూ తమిళనాడు తీరం వైపు ప్రయాణించే అవకాశం ఉందన్నారు. 4 రోజుల్లో రాయలసీమ, దక్షిణకోస్తా, ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయమని వాతావరణ శాఖ తెలిపింది.
Be the first to comment