Candidates Asking APPSC to Postpone Group-II Mains Examination : వచ్చే ఏడాది జనవరి 5న నిర్వహించబోయే గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ఏపీపీఎస్సీని కోరుతున్నారు. సిలబస్ మార్పులు, పూర్తిస్థాయిలో సన్నద్ధత కోసం మరికొంత సమయం పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నిరుద్యోగుల అభ్యర్థన, ఆందోళన దృష్ట్యా సానుకూల నిర్ణయం తీసుకోవాలని పలువురు ప్రజాప్రతినిధులు సైతం ఏపీపీఎస్సీ కి విజ్ఞప్తి చేశారు. గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష గడువు పెంపుపై సానుకూలంగా స్పందించిన ఏపీపీఎస్సీ, డీఎస్సీ తేదీల ప్రకటనలను బట్టి గ్రూప్-2 ప్రధాన పరీక్ష తేదీలపై నిర్ణయం తీసుకోనుంది.
Be the first to comment