Chandrababu Speech in Assembly : స్వార్థ ప్రయోజనాల కోసం తాము కలిసి పోటీ చేయలేదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలనే లక్ష్యంతో కలిసి పోటీ చేసినట్లు చెప్పారు. వైఎసార్సీపీ పాలనలో రాష్ట్ర ఆర్థికవ్యవస్థ నిర్వీర్యమైందని ఆరోపించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ లేకుంటే ఏపీని పునర్నిర్మాణం చేయలేమని భావించామని తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తున్న కేంద్రానికి ధన్యవాదాలు తెలియజేశారు. వెంటిలేటర్పై ఉన్న ఆంధ్రప్రదేశ్ను ఇప్పుడిప్పుడే బయటకు తెస్తున్నామని వ్యాఖ్యానించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడారు.
Be the first to comment