Jagan Role Behind Saraswati Power Plant in Palnadu District : జగన్కు చెందిన సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్కు పల్నాడు జిల్లాలో వందల ఎకరాల్లో సున్నపురాయి నిల్వలను వైఎస్ హయంలో కట్టబెట్టడంలో నిబంధనలకు పాతరేశారు. జగన్ సీఎం అయ్యాక మరింత ముందుకు వెళ్లి సొంత కంపెనీకి మరిన్ని 'మేళ్లు' చేసుకున్నారు. పర్యావరణ శాఖను తప్పుదోవ పట్టించి ఎప్పటికప్పుడు అనుమతులు పునరుద్ధరించుకుంటున్న విషయం అధికారుల పరిశీలనలో బయటపడింది. జగన్ కంపెనీ ఆధీనంలోని భూముల్లో ప్రభుత్వ భూములూ ఉన్నట్టు అధికారుల దృష్టికివచ్చింది. తండ్రి, కుమారుడు ముఖ్యమంత్రులుగా అధికార దుర్వినియోగానికి పాల్పడి సరస్వతీ పవర్కు అడ్డగోలుగా చేసుకున్న 'మేళ్ల'పై లోతైన విచారణ జరిపితే మరిన్ని విషయాలు బయటకు వస్తాయని అధికారులు భావిస్తున్నారు.
Comments