Many Farmers are Committing Suicide due to Land Issues : ఉమ్మడి అనంతపురం జిల్లాలో భూ సమస్యలు పరిష్కారం కాక ఆవేదనతో అనేక మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మండల స్థాయిలో పరిష్కరించాల్సిన అనేక భూ సమస్యలను జిల్లా కలెక్టర్ వరకు ఫిర్యాదులు వస్తున్నాయి. కొంత మంది అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి రికార్డులు లేవని, అగ్నిప్రమాదంలో కాలిపోయాయని కుంటిసాకులు చెబుతూ బాధితుల సంఖ్యను పెంచుతున్నారు. దీంతో బాధిత రైతులు విధిలేని పరిస్థితుల్లో ప్రాణాలు తీసుకోడానికి సైతం సిద్ధపడుతున్న పరిస్థితి నెలకొంది.
Comments