Minister Ponnam On Vemulawada Temple : రాబోయే కార్తీక మాసం నాటికి వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో నిత్యాన్నదాన సత్రం ప్రారంభిస్తామని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శ్రావణ మాసం సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం తరఫున తన వంతు కృషి చేస్తానని తెలిపారు.