Skip to playerSkip to main contentSkip to footer
  • 6 years ago
Express train collides with MMTS in Hyderabad's Kacheguda, driver still trapped inside.
#KachegudaTrainsCollision
#hyderabad
#mmts
#KachegudaRailwayStation
#MMTS
#KachegudaMMTS
#SCR
#HundryIntercityExpress
#MMTStrain

హైదరాబాద్ లోని కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద రెండు రైళ్లు ఢీకొన్నాయి. స్టేషన్ సమీపంలో ఇంటర్ సిటీ రైలు ఆగి ఉండగా..అదే ట్రాక్ మీదకు ఎంఎంటీయస్ రైలు వచ్చింది. గ్రీన్ లైట్ రావటంతో అదే లైన్ లోకి ఎంఎంటీయస్ రైలు వచ్చింది. అయితే, పట్టాలు మారాల్సి ఉన్నప్పటికీ..ట్రాక్ మీద ముందుకు వెళ్లేందుకు సాంకేతికంగా గ్రీన్ సిగ్నల్ ఉండటంతో స్టేషన్ లోకి మరో కొద్ది సెకన్లలోకి చేరుకొనే సమయంలో ఆకస్మికంగా ఎదురుగా ఆగి ఉన్న రైలు కనిపించింది. కానీ, అప్పటికే నియంత్రణ లేకుండా పోయింది .దీంతో.. ఆగి ఉన్న ఇంటర్ సిటీ రైలును ఎంఎంటీయస్ రైలు ఢీ కొట్టి..మూడు కోచ్ లు ధ్వంసం అయ్యాయి. దీంతో..ముందుగా డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ రెండు రైళ్ల మధ్య చిక్కుకుపోయారు. డ్రైవర ను సహచర సిబ్బంది..ప్రయాణీకులు బయటకు తీసారు. అయితే, ధ్వంసం అయిన మూడు కోచ్ ల్లో దాదాపు 20 మంది ప్రయాణీకులకు గాయాలయ్యాయి. అందులో నలుగురు ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారు. రైల్వే అధికారులు వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు.

Category

🗞
News

Recommended