Brammakamalam : ఉత్తరాఖండ్, కేదారినాథ్, బద్రీనాథ్ తదితర పుణ్యక్షేత్రాల ప్రాంతాల్లో పూసే అరుదైన పుష్పం బ్రహ్మ కమలం. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని విద్యానగర్ ప్రాంతానికి చెందిన గుండు ప్రభాకర్-లక్ష్మి దంపతుల ఇంట్లో ఏకంగా మూడు బ్రహ్మ కమలాల పువ్వులు పూసాయి. దీందీ ఆ కుటుంబ సభ్యులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆ పూలకు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేసి, వాటిని వినాయకునికి పెట్టి మొక్కులు చెల్లించుకున్నారు. సాధారణంగా ఈ పూలు ప్రతి సంవత్సరం జులై నుంచి సెప్టెంబర్ మధ్యలో సంవత్సరానికి ఒకసారి పూస్తూ ఉంటాయి. రాత్రి సమయాల్లో పది దాటిన తర్వాత పూలు విరబూసి 12 గంటల సమయంలో సువాసన ఇస్తుంటాయి. ఉదయం ముడుచుకు పోవడం బ్రహ్మ కమలాల ప్రత్యేకతలు. అరుదైన పూలు తమ ఇంట్లో పూయడం సంతోషంగా ఉందని చెప్పారు. హిమాలయాల్లో వికసించే ఈ పూలు ఇళ్లలో పూయడం అరుదుగా భావిస్తారు. బ్రహ్మ కమల పూలు పూసాయని తెలుసుకున్నచుట్టుపక్కల వారు పువ్వులను చూసేందుకు ఎంతో ఆసక్తి కనబరిచారు.
Comments