Skip to playerSkip to main content
  • 15 minutes ago
People Faced Difficulties While Two Trains Were Halted For Hours At Eluru District : శుక్రవారం నాడు ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలంలో ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు గంటల తరబడి నిలిచిపోయాయి. తూర్పుగోదావరి, కొవ్వూరు స్టేషన్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. రైలు సేవలకు అంతరాయం కలిగింది. తూర్పు గోదావరి రైల్వే సిబ్బంది మరమ్మతులు చేపడుతున్నారు. దీనివల్ల, బెంగళూరు-రాధికాపూర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ (16223)ను చెబ్రోలు రైల్వే స్టేషన్‌లోనూ, విజయవాడ-రాజమహేంద్రవరం మెము ప్యాసింజర్ రైలు (67262)ను బడంపూడి రైల్వే స్టేషన్‌లోనూ నిలిపివేశారు. సుదీర్ఘ జాప్యం కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ప్లాట్‌ఫారమ్‌ల పైనే వేచి ఉండాల్సి వచ్చింది. ఈ  అనుకోని ప్రమాదం కారణంగా వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు ఏమి చేయలేక అక్కడే స్టేషన్​లలో ఉంచాల్సి వచ్చింది. అంత సేపు టైన్లో కూర్చోలేక ప్రజలు ట్రైన్​ నుంచి కిందకు దిగి పట్టాలపై, ప్లాట్​ఫారంపై తిరుగుతూ కాలక్షేపం చేశారు. 

Category

🗞
News
Transcript
00:26Thank you for listening.
Comments

Recommended