Rammohan Naidu in Rajya Sabha : తెలుగు ప్రజలందరికీ నేడు చరిత్రాత్మకమైన రోజు అని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. చరిత్రలో ప్రజా రాజధానిగా అమరావతి గుర్తుంటుందని చెప్పారు. రాజ్యసభలో అమరావతి బిల్లును కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ప్రవేశపెట్టారు. అనంతరం చర్చకు ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్ అనుమతించారు. ఈ సందర్భంగా అమరావతికి చట్టబద్ధత బిల్లుపై నిర్వహించిన చర్చలో రామ్మోహన్ నాయుడు మాట్లాడారు.గర్భిణీలు అని కూడా చూడకుండా అమరావతి మహిళా రైతులను సైతం లాఠీలతో కొట్టించారని కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు అన్నారు. అనేక చిత్రహింసలు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన రైతులు, మహిళకు ఆయన ధవ్యవాదాలు చెప్పారు."ప్రపంచవ్యాప్త పెట్టుబడుల ఆకర్షణతో పాటు నివాసయోగ్య ప్రాంతంగా అమరావతిని తీర్చిదిద్దడమే మా లక్ష్యం. 2,000 ఏళ్ల క్రితమే అమరావతి రాజధానిగా శాతవాహనులు పాలించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమాన దూరంలో అమరావతి ఉంటుంది. ఏపీ రాజధానిగా అమరావతికి ఏకగ్రీవ మద్దతు ఉంటుంది. విజయదశమి రోజున అమరావతికి ప్రధాని శంకుస్థాపన చేశారు. పార్లమెంటుతో పాటు కేంద్రం మద్దతు అమరావతికి ఉంది. అన్ని వర్గాల మద్దతుతో అమరావతి నిర్మాణం చేపట్టాం. ఇటుక ఇటుక పేర్చుతూ అమరావతి నిర్మాణం చేపట్టాం. అమరావతిని నాశనం చేయాలని ఒక నేత లక్ష్యంగా పెట్టుకున్నారు. 2019లో ప్రభుత్వం మారాక అమరావతితో పాటు ఏపీ మొత్తం ఇబ్బందులు పడింది." -రామ్మోహన్నాయుడు, కేంద్రమంత్రి
Comments