Crackers Lorry Got Fire Accident : కరెంట్ తీగలు తగిలి టపాసుల లోడుతో వెళుతున్న లారీ దగ్ధం అయిన సంఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్ల గ్రామ శివారులో చోటుచేసుకుంది. స్థానికులు, మహేశ్వరం అగ్నిమాపక సిబ్బంది ఇచ్చిన వివరాల ప్రకారం, టపాసుల లారీ కొంత సరుకును మహేశ్వరం మండల కేంద్రంలోని గోదాంకు చేర్చింది. మరికొంత భాగం నిజమాబాద్లో ఉన్న గోదాంకు తరలించేందుకు బయలుదేరింది. మండల కేంద్రానికి వెళ్లడానికి దగ్గరవుతుందన్న సమాచారంతో లారీ డ్రైవర్ పింజర్ల రోడ్డు మీదుగా మహేశ్వరానికి బయలుదేరారు. గోదాంకు త్వరగా చేరుకోవాలని లారీ రూట్ను గ్రామీణ ప్రాంతం మీదుగా మళ్లించారు. శంషాబాద్ నుంచి కొత్తూరు వైపు ఉన్న హై టెన్షన్ వేర్ల కిందగా లారీ వెళుతుండగా ప్రమాదవశాత్తు తీయలు తగిలి నిప్పు రవ్వలు చెలరేగాయి. లారీ డ్రైవర్ గమనించకుండా కొద్ది దూరం అలాగే పోనిచ్చాడు. టపాసులు పేలిన శబ్దాలు రావడంతో వెంటనే లారీ ఆపి డ్రైవర్, క్లీనర్ పరుగులు తీశారు. చూస్తుండగానే లారీ పూర్తిగా కాలిపోయింది. టపాసుల శబ్దాలు సమీప గ్రామాలకు వినిపించాయి.
Comments