Police Solved Major Theft Case Within 24 Hours : బాపట్ల జిల్లా ఇంకొల్లులో ఓ వ్యాపారి ఇంట్లో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. నిందితుడి నుంచి 55 లక్షల 50 వేల రూపాయలు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 3న ఇంకొల్లులోని వ్యాపారి జాగర్లమూడి శివప్రసాద్ ఇంట్లో అర్ధరాత్రి చోరీ జరిగింది. నిందితుడు బీరువా తాళాలు పగులగొట్టి రూ.55లక్షల 50 వేల నగదు, 20 లక్షల విలువైన బంగారం ఎత్తుకెళ్లాడు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు 24 గంటల్లో దొంగను పట్టుకున్నారు.
Be the first to comment