Eluru District Police Recover 638 Stolen Cell Phones : ఏలూరు జిల్లాలో చోరీకి గురైన ఖరీదైన సెల్ఫోన్లను పోలీసులు పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ ఉపయోగించి 638 ఫోన్లను తిరిగి రాబట్టారు. వీటి విలువ రూ. 76,56,000 ఉంటుందని వెల్లడించారు. 3 నెలల కిందట నుంచి చోరీకి గురైన ఫోన్లను రికవరీ చేసినట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఫోన్లను అసలైన వినియోగదారులకు తిరిగి అందజేశారు.
Comments