Visakha Regional Tourism Summit : విశాఖలో సోమవారం నాడు నిర్వహించిన ఒకరోజు ప్రాంతీయ స్థాయి పర్యాటక సదస్సుకు ఉత్తరాంధ్రలో పెట్టుబడులకు ఆసక్తి ఉన్న సంస్ధలు, వ్యక్తులు హాజరయ్యారు. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రసంగం చేశారు. ఈ సదస్సుకు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు హాజరై ఉత్తరాంధ్రలో పర్యాటక రంగంపై తన అనుభవాలను వివరించారు. వినోదరంగంలో ఉన్న నిబంధనలు తొలగించేందుకు ప్రయత్నించాలని చెప్పారు.