Tech Event in bits Pilani Hyderabad : దేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకమైన టెక్ ఈవెంట్ అట్మోస్ - 2024 బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్లో కొనసాగుతోంది. 2012లో ప్రారంభమైన ఈ వేడుకలు ఏటా జరుగుతున్నాయి. విద్యార్థులకు పరీక్షలే కాదు, ప్రాక్టికల్స్ కూడా ముఖ్యమే. విద్యార్థుల్లోని స్కిల్స్ని బయటపెట్టాలంటే అవే అసలైన మార్గాలు. తద్వారా టీం వర్క్, లీడర్ షిప్ వంటివి బలపడతాయి. అలాంటి వాటిని వెలికితీయడానికి బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ అట్మోస్ టెక్నికల్ ఈవెంట్ను తీసుకొచ్చింది. ఇందులో విద్యార్థులు తమ ప్రతిభా నైపుణ్యాలను ప్రదర్శించారు. ఐస్క్రీమ్ పుల్లలతో తయారు చేసిన భవనాల నమూనాలు ఎంతో ఆకట్టుకున్నాయి. దీంతో పాటు అంతరిక్షంలోని గ్రహాలను చూసే టెలిస్కోప్ ఈ సందర్శనలో ఎంతగానో ఆకట్టుకుంది. మరి, ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
Be the first to comment