Minister Konda Surekha Severe Comments On BRS : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కాదని కేసీఆర్ను నమ్మి ప్రజలు రెండు సార్లు అధికారంలోకి తెస్తే ధనిక రాష్ట్రాన్ని అప్పుల కూపంలోకి నెట్టారని రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం శ్రీ ఉమామహేశ్వర దేవాలయం నూతన పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మంత్రిగా మొట్టమొదటిసారి అచ్చంపేట నియోజకవర్గానికి కొండ సురేఖ రావడంతో మంత్రికి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఘనంగా స్వాగతం పలికారు.
Be the first to comment