CM Revanth Foreign Tour Ends : పెట్టుబడుల కోసం విదేశాలకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటన నేటితో ముగియనుంది. చివరి రోజు దక్షిణ కొరియాలో పలువురు పారిశ్రామికవేత్తలతో చర్చలు జరపనున్నారు. సోమవారం చియోన్ జి చియోన్ స్ట్రీమ్ను పరిశీలించిన సీఎం, నేడు హన్ రివర్ ఫ్రంట్, కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీని సందర్శించనున్నారు. పర్యటన ముగించుకొని సింగపూర్ మీదుగా బుధవారం హైదరాబాద్కు రానున్నారు. అమెరికాలోనే సుమారు 31 వేల 532 కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.