చింతపల్లి మండలం రోలంగి గ్రామ సంకురమ్మ దేవతల వద్ద గుప్త నిధుల తవ్వకాలు గత ఐదేళ్లుగా గుట్టుగా కొనసాగుతున్నాయి. ప్రతి సంవత్సరం ఒక అమ్మవారి దేవత వద్ద తవ్వుకొని పోతున్నారు. పాత డబ్బులు, రాగి నాణేలు కుండలో దాచి ఉంటారని.. ఇప్పుడు అవి తెలిసిన వ్యక్తులు అమ్మవారి దేవతలను తొలగించి భూమి లోపల తవ్వి గుప్త నిధులను తీసుకు పోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.