నిజామాబాద్ జిల్లాలో కరెన్సీ నోట్ల తుక్కు బయటపడటం తీవ్ర కలకలం రేపింది. మొండోరా మండలంలోని బుస్సాపూర్ వద్ద హైదరాబాద్-నాగ్పూర్ నేషనల్ హైవేపై బుధవారం ఓ లారీలో నుంచి సంచి బయటపడింది. దానిపై నుంచి వెనుక వచ్చిన వాహనాలు వెళ్లడంతో సంచి చిరిగిపోయి అందులోని కరెన్సీ నోట్ల తుక్కు బయటపడింది. గాలికి ఆ కరెన్సీ నోట్ల ముక్కలు చుట్టుపక్కల ప్రాంతాలకు కొట్టుకుపోయాయి.