Skip to playerSkip to main content
  • 4 years ago
ఏపీలోని విజయనగరం జిల్లాలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. అతడు కూడాహోం క్వారంటైన్‌లోనే వైరస్‌ను జయించారని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ హైమావతి తెలిపారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌ యాక్టివ్‌ కేసులు రాష్ట్రంలో ఒక్కటి కూడా లేవని శుభవార్త చెప్పారు. ఐర్లాండ్‌ నుంచి వచ్చిన వ్యక్తికి కోవిడ్‌ పాజిటివ్‌గా తేలడంతో ఈ నెల మొదటి వారంలో హైదరాబాద్‌లోని జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌కు అతడి శాంపిల్స్ పంపామన్నారు. రిపోర్ట్స్ శనివారం రాత్రి అందిందని చెప్పారు. ఆయనకు హోమ్‌ క్వారంటైన్‌ తర్వాత శనివారం నిర్వహించిన వైద్యపరీక్షల్లో నెగెటివ్‌గా తేలిందన్నారు.. ఆయన ఆరోగ్యంగా ఉన్నారని చెప్పుకొచ్చారు.తిరుపతిలో ఓ వ్యక్తికి ఒమిక్రాన్‌గా తేలిందని జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని హైమావతి తెలిపారు. ప్రజలు ఆందోళన చెందవద్దని.. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, భౌతిక దూరం.. ఇతర నిబంధనలు పాటించాలని కోరారు. విదేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరినీ గుర్తించి వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు.

Category

🗞
News

Recommended