Skip to playerSkip to main content
  • 5 years ago
తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతిపై క్రిమినల్ కేసు నమోదైంది. విజయ్ సేతుపతితోపాటు.. అతని మేనేజర్ జాన్సన్‏లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ సైదాపేట కోర్టులోకేసు వేశారు. గత నెలలో బెంగుళూరు విమానాశ్రయంలో విజయ సేతుపతి పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. బెంగుళూరు విమానాశ్రయంలో విజయ్ గాంధీ అనే వ్యక్తి దాడి చేశాడు. దీంతో అప్రమత్తమైన విజయ్ సేతుపతి మేనేజర్.. ఇతర భద్రతా సిబ్బది అతడిని వారించారు. ఇప్పటికే పరువు నష్టం దావా వేసిన గాంధీ..తాజాగా క్రిమినల్ కేసు పెట్టారు. నవంబర్ 2న తాను మెడికల్ చెకప్ కోసం మైసూర్ వెళ్తున్నానని.. బెంగుళూరు ఎయిర్ పోర్టులో సేతుపతిని కలిశానని.. ఇద్దరి మధ్య అపార్థాలు రావడంతో విజయ్ సేతుపతితోపాటు అతని మేనేజర్ జాన్సన్ తనను కొట్టారని ఫిర్యాదులో పేర్కోన్నాడు.

Category

🗞
News

Recommended