కేసు నిమిత్తం పోలీస్ స్టేషన్కు వెళ్లిన మహిళను ఎస్ఐ లొంగదీసుకుని, గర్భవతిని చేశాడు. అనంతరం ఆమెకు బలవంతంగా అబార్షన్ చేయించిన ఘటన తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. బాధిత మహిళ కోర్టును ఆశ్రయించడంతో అతడిపై కేసు నమోదుచేయాలని ఆదేశాలు జారీచేసింది.