Skip to playerSkip to main content
  • 6 years ago
Medaram Jatara, one of the oldest tribal festivals in the country held in Telangana’s Mulugu district annually, is going plastic-free this year.
#medaramjathara2020
#medarmfestival
#sammakkasaralammajathara
#sammakkasarakkajathara
#tribalfestival
#tsrtc
#kcr
#ktr
#mpkavitha
#telangana
మరో రెండు రోజుల్లో మేడారం జాతర ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం పూర్తి చేసింది. భక్తులు కూడా సమ్మక సారలమ్మలను దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర కావడంతో పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు. ఫిబ్రవరి 5-7
రానున్న 10 రోజుల్లో దాదాపు కోటి మంది ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
కాగా, ఫిబ్రవరి 7వ తేదీని కుటుంబసమేతంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మేడారంలో పర్యటించనున్నట్లు తెలిసింది. 7న ఉదయం 10.30గంటలకు ఆయన సమ్మక్క-సారలమ్మ దేవతలకు మొక్కులు చెల్లించుకుంటారని, ఆయనతోపాటు పలువురు మంత్రులు కూడా అమ్మవార్లను దర్శించుకుంటారని అధికార వర్గాలు వెల్లడించాయి.
ముఖ్యమంత్రి మేడారంను సందర్శించనున్న క్రమంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అధికారులు సీఎం పర్యటకు సంబంధించిన అన్ని ఏర్పాటు పూర్తి చేసినట్లు తెలిసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. భారీ ఎత్తున భక్తులు తరలివస్తుండటంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతారయం ఏర్పడుతోంది.

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended