Skip to playerSkip to main content
  • 7 years ago
Vijayawada:YSRCP chief YS Jagan Mohan Reddy's padayatra entered in Krishna district on its 136th day. YS Jagan will cover a distance of 270 kilometres and walk through 13 constituencies in the district. On this Occasion TDP Senior Leader Yalamanchili Ravi has joined in YSR Congress party.
వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన 136వ రోజు పాదయాత్ర శనివారం ఉయదం కృష్ణా జిల్లాలోకి ప్రవేశించింది.కనకదుర్గ వారధి వద్ద వైయస్‌ జగన్‌ కృష్ణా జిల్లాలోకి అడుగు పెట్టారు. జననేతతో కలసి అడుగు వేసేందుకు జనం భారీగా తరలిరావడంతో కనకదుర్గ వారధి పోటెత్తింది.వైయస్‌ జగన్‌ను కలిసేందుకు కృష్ణా జిల్లా లాయర్లు కనకదుర్గ వారధికి చేరుకున్నారు. జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో 270 కిలోమీటర్ల మేర వైయస్‌ జగన్‌ పాదయాత్ర చేసారు.ఇప్ప‌టి వ‌ర‌కు కడప, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం, గుంటూరు జిల్లాల్లో పాద‌యాత్ర పూర్తి చేసుకొని శనివారం ఉద‌యం దుర్గమ్మ సాక్షిగా కృష్ణా జిల్లాలోకి ప్రవేశించారు వైయ‌స్‌ జగన్‌ను కలిసేందుకు కృష్ణా జిల్లా లాయర్లు కనకదుర్గ వారధికి చేరుకున్నారు. పాదయాత్రతో విజయవాడలో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. వైసిపి అధినేత జగన్ ప్రజాసంకల్పయాత్ర కృష్ణా జిల్లాలోకి అడుగు పెట్టడంతోనే విజయవాడ టిడిపి నేత యలమంచలి రవి ఆ పార్టీలో చేరిపోయారు. టిడిపికి కంచుకోట లాంటి కృష్ణా జిల్లాలో ఈ పరిణామం వైసిపి శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపింది. జగన్ పాదయాత్ర కృష్ణా వారధి వద్దకు చేరుకోగానే అప్పటికే తన అనుచరులు,అభిమానులు,మద్దతుదారులతో అక్కడ వేచిచూస్తున్న యలమంచలి రవి తాను పార్టీలో చేరుతున్నట్లు చెప్పగానే వైకాపా అధినేత జగన్ తమ పార్టీ కండువా కప్పి వైసిపి లోకి ఆహ్వానించారు. యలమంచలి రవి చేరికతో విజయవాడలో వైసిపి బలపడుతుందని చెప్పారు.

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended