Skip to playerSkip to main content
  • 8 years ago
High Alert in Hyderabad now. Already police force taken Madhapur, Hi-Tech city areas into their hands. As GES is going on from 28th of this month in Hitex city police is taking necessary precautions and security messures.

భాగ్యనగరంలో మూడ్రోజులపాటు గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ సమ్మిట్(జీఈఎస్) జరగనున్న నేపథ్యంలో మాదాపూర్‌, హైటెక్‌ సిటీ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా పోలీసులే కనిపిస్తున్నారు
ఈ నెల 28, 29, 30 తేదీల్లో హెచ్‌ఐసీసీలో జరగనున్న అంతర్జాతీయ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కుమార్తె ఇవాంకా ట్రంప్‌, ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ప్రపంచ వ్యాప్తంగా 1600 మంది ప్రతినిధులు రానుండడంతో ప్రత్యేక భద్రతా చర్యలు చేపడుతున్నారు.
ఈ నెల 29వ తేదీన గోల్కొండ కోటకు 1,500 మంది విదేశీ ప్రతినిధులు బృందం రానుంది. వీరికి ప్రభుత్వం గోల్కొండ కోటలో విందు ఏర్పాటు చేసింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని గోల్కొండ కోటలో వారం రోజులు ముందునుంచే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టారు. కోటను పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రతినిధి బృందానికి అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు వీలుగా గోల్కొండ కోటలో మూడు రోజులు పాటు పర్యాటకులను ఎవరినీ అనుమతించడం లేదు. గోల్కొండ కోట నుంచి చుట్టూ రెండు కిలోమీటర్ల మేర పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. కోట ప్రధాన ద్వారం వద్ద ప్రత్యేక చెక్‌పోస్ట్‌ ఏర్పాటు చేశారు. టాస్క్‌ఫోర్స్‌, ఇంటలిజెన్స్‌, డాగ్‌, బాంబ్‌ స్క్వాడ్‌ బృందాలు క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నాయి.

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended