Manduva Vinayaka In Karimnagar : భక్తులను ఆకట్టుకునేందుకు ఆకర్షించేందుకు కరీంనగర్లో గణేశ్ మండపాల నిర్వాహకులు పోటీపడుతున్నారు. జిల్లాలోని చైతన్యపురి కాలనీలో గుహ మాదిరిగా సెట్టింగ్ ఏర్పాటు చేశారు. స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు ఊడల మర్రిలో నుంచి వెళ్తున్నామా అన్నట్టు ఆశ్చర్యం చెందుతున్నారు. నిర్వాహకులు సెట్టింగ్ను అంత అందంగా తీర్చిదిద్దారు. మండువా వినాయకుడి ముందు భాగం ఏనుగు ఆకారంలో తీర్చిదిద్దారు. లోపలికి వెళ్లేటప్పుడు ఒక పెద్ద మర్రి చెట్టు ఊడలు కిందకు ఊగుతున్నట్టుగా తయారు చేశారు. భక్తులు ఈ సెట్టింగ్ చూసి తన్మయం చెందుతున్నారు. చైతన్యపురిలోని మరో గణనాథుని కూడా మండువాలలో ఏర్పాటు చేశారు. ఇది గ్రామీణ ప్రాంతంను ఉట్టిపడేలా తాత్కాలిక మండువ ఆకారాన్ని తీర్చిదిద్దారు. తల్లి ఒడిలో వినాయకుడు ఉన్నట్టు ఉన్న చూడచక్కని ప్రతిమలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. దీంతో మండువాలో ఉన్న వినాయకుని వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. బుజ్జి గణపతులను చూస్తున్న చిన్నారులు కేరింతలు కొడితే, పెద్దలు ఆనందిస్తున్నారు.
Comments