Women Cricket League Will Be Started Soon in AP: మహిళా క్రికెటర్ల ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ఉమెన్ క్రికెట్ లీగ్ నిర్వహణకు సిద్ధమవుతోంది. మహిళల టీ20 టోర్నమెంట్కు సంబంధించి ఇప్పటికే ప్రాథమిక ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఏసీఏ ప్రతినిధులు తెలిపారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మహిళా క్రికెటర్లకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. ఇప్పటికే పురుషుల విభాగంలో ఏపీఎల్ ద్వారా అద్భుతమైన ప్రతిభను వెలికితీస్తున్న ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అదే తరహాలో మహిళా క్రికెటర్ల కోసం ప్రత్యేకంగా ఉమెన్ క్రికెట్ లీగ్ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఈ టోర్నమెంట్కు సంబంధించి ఏసీఏ ఇప్పటికే ప్రాథమిక ఏర్పాట్లు పూర్తి చేసింది. లీగ్ షెడ్యూల్ను త్వరలోనే అధికారికంగా విడుదల చేయనున్నట్లు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ అపరేషన్ కల్యాణ్ కృష్ణ వెల్లడించారు. ఈ టోర్నీకి సంబంధించిన మరిన్ని వివరాలు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్ కల్యాణ్ కృష్ణ మాటల్లో తెలుసుకుందాం.
Comments