Puri Jagannath Rath Yatra in Hyderabad : భాగ్యనగరంలో ఇస్కాన్ సంస్థ చేపట్టిన జగన్నాథ రథయాత్రలు శోభాయమానంగా సాగాయి. ఇందిరాపార్క్ ధర్నాచౌక్ నుంచి చేపట్టిన రథయాత్రలో మంత్రి శ్రీధర్బాబు, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు. శ్రీధర్ బాబు జగన్నాథుడి రథం లాగి యాత్రను ప్రారంభించారు. పూరీలో రథయాత్రను చూడలేని భక్తుల కోసం ఇస్కాన్ వారు హైదరాబాద్లో ఏర్పాటు చేయడం శుభప్రదమమన్నారు. సికింద్రాబాద్లోనూ జగన్నాథ రథయాత్ర వైభవంగా సాగింది. స్థానిక ఇస్కాన్ దేవాలయం నుంచి హరిహర కళాభవన్ క్లాక్ టవర్ మీదుగా రథయాత్ర నిర్వహించారు. ప్రత్యేక పూజలు తర్వాత ఉత్సవ విగ్రహాలను రథంపై ఊరేగించారు. బంజారాహిల్స్లోని పూరి జగన్నాథ్ ఆలయం నుంచి రథయాత్ర ఘనంగా నిర్వహించారు. వేలాది మంది భక్తుల జయజయధ్వానాల మధ్య జగన్నాథ స్వామి, బలభద్రుడు, సుభద్రాదేవి విగ్రహాలను రథంపై ఊరేగించారు. బంధుమిత్రులతో భగవంతుని ధ్యానిస్తూ హరే కృష్ణ, హరే కృష్ణ అని స్మరణతో నృత్యాలు చేస్తూ ముందుకు సాగారు.
Comments