TTD Additional EO pressmeet on Boy Death at Tirumala Annadana Satram : తిరుమలలో ఈనెల 22న మంజునాథ అనే బాలుడు అన్నప్రసాద కేంద్రంలో కిందపడి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఆ బాలుడు చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందాడు. చిన్నారి మృతి పై టీటీడీ అదనపు ఈవో స్పందించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ బాలుడు మంజునాథ్ మృతి దురదృష్టకరమని అన్నారు. బాలుడి మృతికి సంబంధించి సీసీ కెమెరాలు పరిశీలించామని తెలిపారు. ర్యాంప్పై పరిగెత్తుతూ బాలుడు కిందపడ్డాడని అతడికి ఇదివరకే గుండె సంబంధిత చికిత్స జరిగిందిని వివరించారు.
Be the first to comment