Telangana Panchayat Elections 2025 : పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నాయి. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన కీలక సమావేశాలు ఇవాళ జరగనున్నాయి. రిజర్వేషన్లపై కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. ఎన్నికల సన్నాహాలపై కలెక్టర్లు, అదనపు కలెక్టర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటా ఏర్పాటుపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో రాష్ట్ర ఎన్నికల సంఘం చర్చించనుంది.
Be the first to comment