Murthy Yadav on Visakha Dairy : విశాఖ డెయిరీని ఆ సంస్థ ఛైర్మన్ ఆడారి ఆనంద్ కుటుంబం దోచుకుంటోందని జనసేన కార్పొరేటర్ మూర్తియాదవ్ ఆరోపించారు. వెంటనే ఆ సంస్థ పాలకవర్గాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా లాభాల్లో ఉన్న లాభాల్లో ఉన్న విశాఖ డెయిరీ మొదటిసారి నష్టాల్లోకి వెళ్లిందని విమర్శించారు. మరి కొద్దీ రోజుల్లో కనీసం ఉద్యోగుల జీతాలు కూడా ఇవ్వలేని స్థితికి చేరుకుంటోందని వాపోయారు. విశాఖ పబ్లిక్ లైబ్రరీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
Be the first to comment