BJP Special Focus on Telangana : రాష్ట్రంలో సభ్యత్వ నమోదు ప్రక్రియపై బీజేపీ జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలో 50 లక్షల సభ్యత్వం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న కమలం పార్టీ నేడు ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే సభ్యత్వ నమోదు ప్రక్రియకు సంబంధించి కార్యశాలలను నిర్వహించి పార్టీ శ్రేణులకు ముఖ్యనేతలు దిశానిర్దేశం చేశారు.