కేవలం 39,999 రూపాయలకే డిటెల్ ఎలక్ట్రిక్ స్కూటర్

  • 3 years ago
ఇండియన్ ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ సంస్థ డిటెల్ దేశీయ మార్కెట్లో ఈజీ ప్లస్ అనే స్లో-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. డిటెల్ ఈజీ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర కేవలం 39,999 రూపాయలు మాత్రమే.

డిటెల్ కంపెనీ యొక్క ఈ ఈజీ ప్లస్ స్కూటర్‌ ఫ్రీ బుకింగ్స్ మొదలయ్యాయి. దీనిని రూ. 1,999 టోకెన్ మొత్తానికి బ్రాండ్ వెబ్‌సైట్‌లో ప్రీ-బుక్ చేసుకోవచ్చు. రైడ్ ఆసియా ఎక్స్‌పోలో ఈ-స్కూటర్ వివరాలను కంపెనీ అధికారికంగా వెల్లడించింది. ఈ స్లో-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ 20AH లిథియం-అయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది.

డిటెల్ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.

Category

🚗
Motor

Recommended