భారత్‌లో ఈక్యూసి లాంచ్ డేట్ ధ్రువీకరించిన మెర్సిడెస్ బెంజ్

  • 4 years ago
జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ మెర్సిడెస్ బెంజ్, భారత మార్కెట్‌లో తమ సరికొత్త పుల్ ఎలక్ట్రిక్ కారు "ఈక్యూసి"ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. కానీ ఇప్పుడు కంపెనీ తమ మొట్టమొదటి ఫుల్ ఎలక్ట్రిక్ కారు విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది.

భారత్‌లో తమ ఆల్-ఎలక్ట్రిక్ ఈక్యూసి వాహనాన్ని 2020 అక్టోబర్ 8 వ తేదీన విడుదల చేయనున్నట్లు మెర్సిడెస్ బెంజ్ తెలిపింది. భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ వల్ల కంపెనీ తమ పాపులర్ ఈక్యూసి ఆల్-ఎలక్ట్రిక్ కారును దేశీయ మార్కెట్లో విడుదల చేస్తోంది.

Recommended