నాలుగు రోజుల క్రితం భారత్-చైనా సరిహద్దు గాల్వన్ లోయ ప్రాంతంలో చైనా దొంగదెబ్బ తీసి మన సైనికులపై క్రూరంగా దాడి చేసింది. ఈ దాడిలో తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ బాబుతోపాటు 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. కాగా, కల్నల్ సంతోష్ బాబు పోస్టుమార్టం నివేదికలో సంచలన విషయాలు వెలుగుచూశాయి.