Skip to playerSkip to main content
  • 8 years ago
Tollywood actor Posani krishna murali responded on TDP MLC Rajendraprasad comments on Wednesday over special status.

ఏపీకి ప్రత్యేక హోదా కోసం సీఎం చంద్రబాబునాయుడుతో సహ ఆ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులంతా విజయవాడలో దీక్షకు దిగితే తాను కూడ సీని పరిశ్రమ తరపున దీక్షకు కూర్చొంటానని పోసాని కృష్ణమురళి చెప్పారు. తన సవాల్‌కు టిడిపి నేతలు సిద్దమేనా అని ఆయన ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదానే అవసరం లేదని, ప్యాకేజీ సరిపోతోందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారని సినీ నటుడు పోసాని గుర్తుచేశారు. ప్రధానమంత్రి మోడీతో ఏదో గొడవ వస్తే దాన్ని ఏపీ ప్రజల సమస్యగా మాట్లాడుతున్నారని పోసాని అభిప్రాయపడ్డారు.
మంగళవారం నాడు అమరావతిలో మీడియాతో మాట్లాడిన రాజేంద్రప్రసాద్ సినీ నటులపై ధ్వజమెత్తారు. సినిమా వాళ్ళకు డబ్బులే లోకమని టిడిపి ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలను పోసాని ప్రస్తావించారు. ప్రత్యేకహోదా విషయంలో దీక్షకు వచ్చిన సినిమా వాళ్ళను కూడ లాఠీలతో కొట్టించిన ఘనత మీదే కదా పోసాని కృష్ణమురళి ప్రశ్నించారు.
ప్రత్యేక హోదా వల్లే ఏపీ రాష్ట్రానికి న్యాయం జరుగుతోందని ఏపీ రాష్ట్రంలో పలు చోట్ల ఆందోళనలు చేసిన పార్టీలు, సంఘాల నేతలపై ప్రభుత్వం ఎందుకు దాడులు చేయించిందని సినీ నటుడు పోసాని కృష్ణమురళి టిడిపి నేతలను ప్రశ్నించారు.ఆందోళనకారులను తరిమి తరిమి కొట్టించిన చరిత్ర టిడిపి నేతృత్వంలోని ప్రభుత్వానిదేనని ఆయన చెప్పారు.
పూటకో మాట మార్చుతున్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడును చూసి తాము పోరాటం చేయాలా అంటూ సినీ నటుడు పోసాని కృష్ణమురళి ప్రశ్నించారు.
ఏపీ ప్రజలకు పోరాటాలు కొత్త కాదని సినీ నటుడు పోసాని కృష్ణమురళి గుర్తు చేశారు. జై ఆంధ్ర, జై సమైక్యాంధ్ర ఉద్యమాల్లో ప్రజలు పాల్గొన్నారని ఆయన గుర్తు చేశారు . ప్రస్తుతం జరుగుతున్న ప్రత్యేక హోదా ఉద్యమంలో కూడ ప్రజలు పాల్గొంటున్నారని ఆయన చెప్పారు. అయితే అదే సమయంలో ప్రజలను పాలకులు మోసం చేశారని ఆయన అభిప్రాయపడ్డారు.

Category

🗞
News
Comments

Recommended