Nandamuri Kalyan Ram's latest film 'MLA' getting ready for the release soon. As the teaser and other promos are impressive, the movie pre-release business closed at Rs.22 crores.
అటు నిర్మాతగా సినిమాలు తీస్తూనే ఇటు నటుడిగా తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు హీరో కళ్యాణ్ రామ్. త్వరలో ఈ నందమూరి హీరో 'ఎంఎల్ఏ' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.
‘ఎంఎల్ఏ' చిత్రం టీజర్, ప్రోమోలు ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా జరిగింది. రూ. 22 కోట్ల వద్ద ప్రీ రిలీజ్ బిజినెస్ క్లోజ్ అయినట్లు సమాచారం.
‘ఎంఎల్ఏ' నైజాం ఏరియా రైట్స్ రూ. 4.2 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. సీడెడ్ రూ. 2.5 కోట్లు, ఆంధ్రా ఏరియాలో అన్ని టెర్రిటరీలు కలిపి రూ. 6.3 కోట్ల బిజినెస్ జరిగినల్లు సమాచారం. దీంతో ఓవర్సీస్ రైట్స్ రూపంలో రూ. 5 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది.
‘ఎంఎల్ఏ' చిత్రం బాక్సాఫీస్ టార్గెట్ రూ. 25 కోట్లుగా పెట్టుకున్నట్లు సమాచారం. అందుకు తగిన విధంగానే సినిమాను భారీగా విడుదల చేస్తున్నారు. సినిమా ప్రమోషన్లు కూడా అదే స్థాయిలో నిర్వహించనున్నారు.
మార్చిన 23న ‘ఎంఎల్ఏ' చిత్రాన్ని గ్రాండ్గా విడుదల చేయబోతేన్నారు. కాగా, నేడు జరగబోయే ప్రీరిలీజ్ ఈవెంటుకు కళ్యాణ్ రామ్ సోదరుడు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాజరవుతాడని ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ హాజరయ్యే విషయంలో అధికారిక ప్రకటన అయితే ఏదీ లేదు. ఈ విషయంలో ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగుతోంది.
Comments