Skip to playerSkip to main content
  • 8 years ago
A doctor was imprisoned here on Thursday for Bad Behaviour with trainee-nursing student by administrating her anesthetic injection and for an action replay bid with a few other nursing students of the same group


జలుబు చేసి జ్వరమొచ్చిందని, తగ్గేందుకు ఏదైనా మందు ఇమ్మని అడిగిన ఓ ట్రైనీ నర్సును డాక్టర్ ఏం చేశాడో తెలుసా? తన గదిలోకి తీసుకెళ్లి జలుబుకు మందు ఇస్తున్నానంటూ మత్తు ఇంజెక్షన్ ఇచ్చాడు. ఆపైన ఆమెపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు.
అంత మత్తులోనూ ఆ ట్రైనీ నర్సు అతడ్ని ప్రతిఘటించింది. ఎలాగోలా అతడి బారినుంచి తప్పించుకుని గదిలోంచి బయటికొచ్చి ఆసుపత్రి వరండాలో పడిపోయింది. అక్కడున్న వారు ఆమెను కాపాడి ఏం జరిగిందో తెలుసుకున్నారు. ఆపైన పోలీసులు రంగ ప్రవేశం చేసి సదరు డాక్టర్‌ను అరెస్టు చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలు...
తమిళనాడు రాష్ట్రంలోని డిండిగల్ జిల్లా కొడైకెనాల్‌కు చెందిన యువతి డిండిగల్‌లో ఉన్న ఓ ప్రైవేటు నర్సింగ్ కాలేజీలో నర్సింగ్ డిప్లొమా ఫస్టియర్ చదువుతోంది. కొన్ని వారాల క్రితం ఆ కోర్స్‌లో భాగంగా ప్రాక్టికల్స్ కోసం ఆమెను కాలేజీ యాజమాన్యం కోయంబత్తూరులోని సింగనల్లూరు పట్టణంలో ఉన్న ఏఆర్ఆర్ మెడికల్ సెంటర్‌కు పంపించింది.
నర్సింగ్ కాలేజీ నుంచి మొత్తం 11 మంది అమ్మాయిలు ప్రాక్టికల్స్ కోసం కోయంబత్తూరులోని సింగనల్లూరు పట్టణంలో ఉన్న ఏఆర్ఆర్ మెడికల్ సెంటర్‌కు వచ్చారు. దాని ఛైర్మన్ డాక్టర్ కె.టి.రవీంద్రన్ ఛైర్మన్‌ వీరిలో ఒక ట్రైనీ నర్సుపై కన్నేశాడు.
సోమవారం తన విధులకు హాజరైన ట్రైనీ నర్స్ జలుబు, జ్వరంతో బాధపడుతోంది. ఆమెను పరామర్శించిన డాక్టర్ రవీంద్రన్ తగ్గడానికి మందు ఇస్తాను రమ్మంటూ ఆమెను తన ఛాంబర్‌లోకి పిలిచాడు. అతడి ఉద్దేశాన్ని గ్రహించలేని ట్రైనీ నర్స్ గదిలోకి వెళ్లింది. టాబ్లెట్లతో త్వరగా జలుబు తగ్గదని, ఇంజక్షన్ ఇస్తానంటూ డాక్టర్ రవీంద్రన్ ఆమెకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చాడు.

Category

🗞
News
Comments

Recommended