Skip to playerSkip to main content
  • 9 years ago
I suggested NTR to implement liquor ban before 1994 Assembly elections said Laxmi parvathi. NTR implemented my suggetion on liquor ban she rembered.Laxmiparvathi spoke to media on Tuesday.

మద్యపానం నిషేధించాలని స్వర్గీయ ఎన్టీఆర్‌కు చెప్పింది తానేనని లక్ష్మీపార్వతి గుర్తు చేశారు. 1994 ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో సంపూర్ణ మద్యనిషేధాన్ని ఎన్టీఆర్ అమల్లోకి తెచ్చారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 1994 ఎన్నికలకు ముందు సారాయి వ్యతిరేక ఉద్యమం సాగింది. నెల్లూరు జిల్లాలో దూబగుంట రోశమ్మ ప్రారంభించిన ఉద్యమం రాష్ట్ర మంతటా వ్యాపించింది. ఆనాడు విపక్షంలో ఉన్న టిడిపి, సారాయి వ్యతిరేక ఉద్యమానికి మద్దతుగా నిలిచింది. అంతేకాదు తాము అధికారంలోకి వస్తే సారాయేకాదు సంపూర్ణంగా మద్యాన్ని నిషేధాన్ని విధిస్తామని ఆనాడు ఎన్టీఆర్ ప్రకటించారు. అంతేకాదు అధికారంలోకి వచ్చిన తర్వాత సంపూర్ణ మద్య నిషేధాన్ని ఎన్టీఆర్ ప్రభుత్వం అమలు చేసింది. అయితే అమల్లో లోపాల కారణంగా మద్యం దుకాణాల్లో దొరకలేదు. కానీ,ఇతర రాష్ట్రాల నుండి మద్యాన్ని తీసుకొచ్చి రహస్యంగా విక్రయాలు కూడ చేసిన సందర్భాలు కూడ ఆనాడు చోటు చేసుకొన్నాయి.

Category

🗞
News
Comments

Recommended