APSRTC Bus Carrying Students Veers Into Crop Fields :శ్రీ సత్యసాయి జిల్లా, గుడిబండ మండలంలో విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. జములాబండ గ్రామం సమీపంలో విద్యార్థులతో వెళుతున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న పొలంలోకి దూసుకెళ్లింది. బస్సు అదుపు తప్పి రోడ్డు నుండి పక్కకు దూసుకెళ్లిన తీరు ఆందోళనకరంగా ఉంది. కానీ అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. పలువురు విద్యార్థులకు స్వల్పగాయాలయ్యాయి. అప్రమత్తమైన స్థానికులు వెంటనే విద్యార్థులను బస్సు నుంచి బయటకు తీసి, గాయపడిన వారిని 108 అంబులెన్స్లో మడకసిరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆర్టీసీ సిబ్బంది విద్యార్థులను మడకసిరలోని వారి పాఠశాలలకు సురక్షితంగా తరలించడానికి ప్రత్యామ్నాయ బస్సును ఏర్పాటు చేశారు. బస్సు సామర్థ్యానికి మించి ప్రయాణికులతో వెళుతున్నప్పుడు స్టీరింగ్ నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని విద్యార్థులు, స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదం ఎలా జరిగి ఉండవచ్చు అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments