Skip to playerSkip to main content
  • 6 minutes ago
Robot Ganesh at Uppuguda : హైదరాబాద్​లోని ఉప్పుగూడలో వికసిత్ భారత్​ థీమ్​తో వినాయక మండపాన్ని ఏర్పాటు చేశారు. రోబో రూపంలో గణేశుని ప్రతిమను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో 50వ సంవత్సరం వేడుకల్లో భాగంగా ఈ ప్రతిమను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఇక్కడ ప్రతి ఏడాది ఒక్కో రూపంలో గణేశుడిని ప్రతిష్టిస్తారు. ఈ ఏడాది భారత్​ 2047 తర్వాత పరిస్థితులను ఉద్దేశించి ఈ తరహా గణపతిని ప్రతిష్టించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ విగ్రహం తయారీకి దాదాపు రూ.4 లక్షలు ఖర్చయినట్లు చెప్పారు. ఈ ప్రాంతంలో కొన్నేళ్లుగా వివిధ నేపథ్యాల్లో విగ్రహాలను ప్రతిష్టించారు. వాటిలో ప్రధానమైనవి ఆపరేషన్ సింధూర్​, చంద్రయాన్​, అయోధ్య రామ మందిరం, అనంత పద్మనాభ స్వామి వంటి అనేక థీమ్​లలో ఇక్కడ గణపతిని ప్రతిష్టించారు. ఇక్కడి వినాయకుడిని దర్శించేందుకు నగరంలోని అనేక ప్రాంతాల నుంచి భక్తులు వస్తారు. మండపంలో ప్రతి రోజు ఉదయం గణపతి హోమం, పూజా కార్యక్రమం ఉచితంగా నిర్వహిస్తారు. సాయంత్రం వేళలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

Category

🗞
News
Transcript
00:00Thank you so much for watching.
00:48Thank you so much for watching.
Comments

Recommended