Bhogapuram Airport Ganesh Mandapam : విశాఖ జిల్లాలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల్లో గణనాథుడు విభిన్న రూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్నాడు. భీమునిపట్నం జోన్ చేపలుప్పాడలో భోగాపురం ఎయిర్పోర్ట్ థీమ్తో ఏర్పాటు చేసిన మండపం అందరినీ ఆకట్టుకుంటోంది. చేపల వేటే ప్రధాన వృత్తిగా జీవనం సాగిస్తున్న మత్స్యకార యువకులు ఏటా వివిధ ఆకృతులతో వినాయక మండపాలను ఏర్పాటు చేస్తుంటారు.ఈ ఏడాది విభిన్నంగా అల్లూరి అంతర్జాతీయ విమానాశ్రయం థీమ్తో వినాయక మండపం నమూనాను ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. భోగాపురం ఎయిర్పోర్ట్ను ఎక్కువమంది చూడలేకపోయారని ఆలోటును తీర్చేందుకే దీనిని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సుమారు 80 మంది యువకుల సమిష్టి కృషికి నిదర్శనమే ఈ మండపమని వివరించారు. ఈ సెట్టింగ్తో పాటు వినాయకుడిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారని చెప్పారు. భవిష్యత్లో మరిన్ని ఆలోచనాత్మక మండపాలెన్నో రూపకల్పన చేస్తామని అందరూ ఐకమత్యంగా ఉండాలనేదే తమ లక్ష్యమని వారు వెల్లడించారు.
Comments