Skip to playerSkip to main content
  • 2 days ago
Visakhapatnam Student Clash : విశాఖలోని మధురవాడ ప్రాంతంలో విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. చంద్రంపాలెం ఉన్నత పాఠశాలలో తమ తరగతి గదిలోకి ఎందుకు వచ్చావనే విషయం దగ్గర మొదలైన గొడవ రోడ్లపై రెండు వర్గాలుగా విడిపోయి కర్రలతో కొట్టుకొనే వరకు వచ్చింది. పట్టపగలే మారికవలస రోడ్డులో విద్యార్థుల మధ్య జరిగిన గొడవ స్థానికులను, రోడ్డుపై వెళ్తున్న వారిని విస్తుపోయేలా చేసింది. ఈ గొడవలో ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. పీ.ఎం. పాలెం పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు భాద్యులైన ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గ్యాంగ్ వార్​లో పాల్గొన్న విద్యార్థులు మద్యం మత్తులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మత్తులో ఉండటంతో రోడ్డున పోయే వారితో సైతం గొడవకు దిగారని, గొడవ జరగకుండా ఆపాలని ప్రయత్నం చేసిన వారి మీద కూడా దాడికి యత్నించారని చూసిన వారు చెబుతున్నారు.

Category

🗞
News
Comments

Recommended